ప్రధాని మోడీపై మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోడీపై మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్రం మోడీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని అన్నది కూడా మరిచిపోయి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రధాని మోడీకి సిగ్గుందా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం లేదంటున్న మోడీ..తెలంగాణకు ఏం చేశారని నిలదీశారు. ఏపీ విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అడిగారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న మోడీకి రాష్ట్ర ప్రభుత్వం  ఎలా సహకరిస్తుందన్నారు. 

ఎందుకు సహకరించాలి..?

తెలంగాణ డబ్బులు తీసుకెళ్లి గుజరాత్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్న మోడీకి సహకరించాలా..? రూ. 400 ఉన్న గ్యాస్ రూ. 1200 వందలు చేసినందుకు మోడీకి సహకరించాలా..? తెలంగాణలో సింగరేణి లాభాల బాటలో పయనిస్తుండడం వల్ల ..సింగరేణిలో నష్టాలు చూపి బొగ్గు గనులు వేలం కుట్రలు నిజం కాదా..? మోడీకి భార్యా పిల్లలు ఉంటే కుటుంబాలు పడే బాధలు అర్థం అవుతాయని...ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మోడీ ప్రవర్తన చూసి తెలంగాణ సమాజం ఆయన్ను అసహ్యించుకుంటుందన్నారు.  పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుకుంటూ దొరికిన బండి సంజయ్ ను  ప్రశంసించిన మోడీకి సహకరించాలా..? అని ప్రశ్నించారు.

మోడీని గద్దె దించుతాం

తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎనిమిది ఏళ్లలో ఒక్క గడ్డపార కూడా ఇవ్వలేదన్నారు. ఈ పథకాన్ని ఎత్తివేస్తే కచ్చితంగా ఆ పాపం నిన్ను వెంటాడుతదన్నారు. తమపై ఏ కేసులు పెట్టినా సిద్ధంగా ఉన్నామని..ఎట్టి పరిస్థితుల్లో మోడీకి సహకరించే ప్రసక్తే లేదన్నారు. మోడీని గద్దె దింపే వరకు వదిలే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు.