రైతులు నీటిని సద్వినియోగించుకోవాలె

రైతులు నీటిని సద్వినియోగించుకోవాలె

కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నుంచి యాసంగి పంటల సాగు కోసం నీటిని విడుదల చేశారు మంత్రి గంగుల కమలాకర్. తూము నుంచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈరోజు సాయంత్రానికి 2500 క్యూసెక్కులకు పెంచుతామని అధికారులు తెలిపారు. అలాగే రేపటి నుంచి 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎల్.ఎం.డి దిగువన ఉన్న 9 లక్షల ఎకరాలకు ఏప్రిల్ 10 వరకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వార బందీ పద్ధతిలో కరీంనగర్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహాబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు యాసంగి పంటలకు నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. రైతులు నీటిని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటూ పంటలు వేసుకోవాలని కోరారు.