బీజేపీ నాయకులపై మంత్రి హరీష్ రావు ఫైర్ 

బీజేపీ నాయకులపై మంత్రి హరీష్ రావు ఫైర్ 

హన్మకొండలోని ఆర్ట్స్, సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్ని అబద్ధాలే మాట్లాడారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పోరాటాల గడ్డపై నడ్డా అబద్దాలు చెప్పారని అన్నారు. నడ్డా లాంటి వాళ్ళ మాటలు తెలంగాణ ప్రజలు విశ్వసించరని చెప్పారు. గుజరాత్, మహారాష్ట్రలో ఎందుకు పెన్షన్లు ఇస్తలేరని హరీష్ రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెన్షన్లు ఇచ్చి పెద్ద కొడుకుగా ఆదుకుంటున్నారని తెలిపారు. 

తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర వాటా ఒక్క పైసా కూడా లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు 3 నెలల్లో 15 శాతం పూర్తయ్యాయని చెప్పారు. బీబీ నగర్ లో కేంద్రం చేపట్టిన ఎయిమ్స్ ఆస్పత్రి కోసం కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనతో వస్తే.. వరంగల్ ఆస్పత్రికి తీసుకెళ్లి పనులు ఏమేరకు జరిగాయే చూపిస్తానని చెప్పారు. సిద్దిపేట పట్టణంలోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు బీజేపీపై మండిపడ్డారు.