బీఆర్​ఎస్​ పాలనలోనే జుక్కల్ అభివృద్ధి : మంత్రి హరీశ్​రావు

బీఆర్​ఎస్​ పాలనలోనే  జుక్కల్  అభివృద్ధి : మంత్రి హరీశ్​రావు

కామారెడ్డి/పిట్లం, వెలుగు :  బీఆర్ఎస్ పాలనలోనే జుక్కల్​ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని మంత్రి హరీశ్​రావు చెప్పారు.  బిచ్కుందలో రూ.26 కోట్లతో  నిర్మించనున్న 100 బెడ్స్​ హాస్పిటల్​కు మంత్రి  శుక్రవారం శంకుస్థాపన  చేశారు.  అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ  బిచ్కుందలో 100 బెడ్స్​ హాస్పిటల్​ ఏర్పాటుతో నియోజక వర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. నాగమడుగు లిప్టు ఎత్తిపోతల స్కీమ్​ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

అభివృద్ధికి కొనసాగింపుగా మళ్లీ మూడో సారి స్టేట్​లో బీఆర్​ఎస్​ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే  హన్మంతుషిండే మాట్లాడుతూ 9 ఏండ్ల కాలంలో  100 గ్రామాలకు  బీటీ రోడ్లు వేయించామని తెలిపారు.