దళితబంధును అడ్డుకునే కుట్ర

దళితబంధును అడ్డుకునే కుట్ర

హుజూరాబాద్​ నియోజకవర్గంలో దళితుల కోసం దళితబంధు అమలు చేస్తుంటే బీజేపీ లీడర్లు దానిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నరు. దళితబంధును ఆపేయాలని ఎలక్షన్​ కమిషన్​కు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేఖ కూడా రాసిండు. ఇదెక్కడి ఆనందం? బీజేపీ సర్కారు పేదలను దోచి పెద్దలకు పెడుతున్నది. ఈటల రాజేందర్  పోయిపోయి అలాంటి  పార్టీలో చేరిండు. రాజేందర్ ను చూసే దళితబంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్​ కిట్టు వచ్చినయట. అన్నీ మాయమాటలు చెప్పుకుంటున్నడు.  కేసీఆర్​ బొమ్మతో గెలిచిన ఈటల అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నడు.