
హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితుల కోసం దళితబంధు అమలు చేస్తుంటే బీజేపీ లీడర్లు దానిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నరు. దళితబంధును ఆపేయాలని ఎలక్షన్ కమిషన్కు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేఖ కూడా రాసిండు. ఇదెక్కడి ఆనందం? బీజేపీ సర్కారు పేదలను దోచి పెద్దలకు పెడుతున్నది. ఈటల రాజేందర్ పోయిపోయి అలాంటి పార్టీలో చేరిండు. రాజేందర్ ను చూసే దళితబంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ కిట్టు వచ్చినయట. అన్నీ మాయమాటలు చెప్పుకుంటున్నడు. కేసీఆర్ బొమ్మతో గెలిచిన ఈటల అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నడు.