
రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులు.. కేంద్రానికి రైతు పోరాటాన్ని రుచి చూపించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వ్యవసాయ చట్టాల రద్దు.. రైతుల విజయమని ఆయన అన్నారు. బుల్లెట్లకు, లాఠీలకు, పోలీస్ కంచెలకు ఎదురెళ్లి రైతులు విజయం సాధించిన తీరు అద్భుతమని హరీష్ కొనియాడారు.
‘రైతులను నట్టేట ముంచేలా కేంద్ర ప్రభుత్వం చేసిన నల్ల వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల విజయం. ఏడాది కాలంగా బుల్లెట్లకు, లాఠీలకు, వాటర్ కానన్లకు, పోలీసు కంచెలకు, నిషేధాలకు ఎదురెళ్లి విజయం సాధించిన తీరు అద్భుతం.
రాత్రింబవళ్ళు రోడ్లపై నిలిచి.. నిరసనలతో కేంద్రానికి రైతు శక్తిని, పోరాటాన్ని రుచి చూపించారు. ఇది రైతు విజయం, ఇది దేశ ప్రజల విజయం. రైతు ఉద్యమంలో పట్టుదలతో పాల్గొన్న త్యాగశీలురందరికీ ఉద్యమాభివందనాలు’ అంటూ హరీష్ ట్వీట్ చేశారు.
రైతులను నట్టేట ముంచేలా కేంద్ర ప్రభుత్వం చేసిన నల్లవ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల విజయం. ఏడాది కాలంగా బుల్లెట్ లకు, లాఠీలకు, వాటర్ కానన్ లకు, పోలీసు కంచెలకు, నిషేధాలకు ఎదురెళ్లి విజయం సాధించిన తీరు అద్భుతం. #FarmLaws #AntiFarmerBJP
— Harish Rao Thanneeru (@trsharish) November 19, 2021