
అడ్డుకుని వినతిపత్రం ఇచ్చిన భూ నిర్వాసితులు
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో మంత్రి హరీశ్రావుకు నిరసన తెగ తగిలింది. మంథనిలో ఓ కార్యక్రమానికి వస్తున్న మినిస్టర్ను మంగళవారం రామగిరి మండలం లద్నాపూర్వద్ద భూనిర్వాసితులు అడ్డుకున్నారు. ఓసీపీ కింద భూములు కోల్పోయిన వారందరూ నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీంతో సింగరేణి యాజమాన్యం లద్నాపూర్లో వారి ఇండ్లను కూల్చివేయడానికి ప్రయత్నించింది. అడ్డుకున్న నిర్వాసితులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఆనాటి నుంచి ఏదో విధంగా నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. మంథని ఎంసీహెచ్ఓపెనింగ్కు మంత్రి వస్తున్నాడని తెలుసుకున్న గ్రామస్తులు మంగళవారం రోడ్డుపైకి వచ్చారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. అయినప్పటికీ మంత్రిని అడ్డుకొని ఆర్అండ్ఆర్ప్యాకేజీ ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చారు.