వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచే కేసీఆర్ పోటీ చేయబోతున్నారని మంత్రి హరీశ్రావు క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. శుక్రవారం గజ్వేల్నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ను వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఈసారి గజ్వేల్లో కాకుండా కామారెడ్డి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇటీవల మాట్లాడుతూ.. కేసీఆర్ను కామారెడ్డిలో పోటీ చేయాలని తానే ఆహ్వానించానని చెప్పారు. కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తే తన భవిష్యత్ ఏమిటనేది ఆయనే నిర్ణయిస్తారని కూడా గోవర్ధన్ అన్నారు. ఇంకోవైపు గజ్వేల్లో పోటీ చేయడానికి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి కూడా ప్రయత్నాలు షురూ చేశారు. వీటన్నింటికీ తెరదించుతూ ఒంటేరు ప్రతాప్రెడ్డి సమక్షంలోనే కేసీఆర్ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని హరీశ్ పిలుపునిచ్చారు. దీంతో కేసీఆర్ నియోజకవర్గ మార్పుపై ఇన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయింది.