గజ్వేల్​ నుంచే కేసీఆర్​ పోటీ!

గజ్వేల్​ నుంచే కేసీఆర్​ పోటీ!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్​ నుంచే కేసీఆర్​ పోటీ చేయబోతున్నారని మంత్రి హరీశ్​రావు క్లియర్​ ఇండికేషన్ ​ఇచ్చారు. శుక్రవారం గజ్వేల్​నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ ​నాయకులు బీఆర్ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్​రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ను వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ​ఈసారి గజ్వేల్​లో కాకుండా కామారెడ్డి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది. అక్కడ సిట్టింగ్​ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వ విప్ ​గంప గోవర్ధన్ ​ఇటీవల మాట్లాడుతూ.. కేసీఆర్​ను కామారెడ్డిలో పోటీ చేయాలని తానే ఆహ్వానించానని చెప్పారు. కేసీఆర్ ​కామారెడ్డిలో పోటీ చేస్తే తన భవిష్యత్ ​ఏమిటనేది ఆయనే నిర్ణయిస్తారని కూడా గోవర్ధన్​ అన్నారు. ఇంకోవైపు గజ్వేల్​లో పోటీ చేయడానికి ఫారెస్ట్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ ​చైర్మన్​ ఒంటేరు ప్రతాప్​రెడ్డి కూడా ప్రయత్నాలు షురూ చేశారు. వీటన్నింటికీ తెరదించుతూ ఒంటేరు ప్రతాప్​రెడ్డి సమక్షంలోనే కేసీఆర్​ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని హరీశ్​ పిలుపునిచ్చారు. దీంతో కేసీఆర్​ నియోజకవర్గ మార్పుపై ఇన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయింది.