లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన మంత్రి జగదీశ్ రెడ్డి

లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన మంత్రి జగదీశ్ రెడ్డి

మంత్రి జగదీశ్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా కన్నెపల్లి పంప్‌హౌజ్‌కు వెళ్లిన మంత్రి అక్కడి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. పరిమితి కంటే ఎక్కువ మంది లిఫ్ట్ ఎక్కడంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. జగదీశ్ రెడ్డితో పాటు అతని అనుచరులంతా ఆ సమయంలో లిఫ్ట్ లోనే ఉండిపోయారు. లిఫ్ట్ తెరుచుకోకపోవడంతో అక్కడి సిబ్బంది లిఫ్ట్ అద్దాలను పగులగొట్టి మంత్రిని,అధికారులు బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటనలో అందరూ క్షేమంగా బయట పడ్డారు. మంత్రి జగదీశ్ రెడ్డికి ప్రమాదం తప్పడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు.