దేశ రైంతాంగానికి దిశానిర్దేశం చేసే సత్తా కేసీఆర్‎కు ఉంది

దేశ రైంతాంగానికి దిశానిర్దేశం చేసే సత్తా కేసీఆర్‎కు ఉంది

దేశ రైతులను కాపాడేది కేసీఆర్ మాత్రమేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ నల్గొండ పోయే విషయం.. జిల్లా మంత్రినైన తనకే తెలియదని.. అటువంటిది కేసీఆర్‎కు ఎలా తెలుస్తుందని ఆయన అన్నారు.

‘బీజేపీ నాయకులను నల్గొండ రైతాంగం తిప్పి కొట్టింది. రైతులతో పెట్టుకుంటే నష్టపోయేది మీరే. అవసరం అయితే దేశ రైంతాంగానికి దిశానిర్దేశం చేసే సత్తా కేసీఆర్‎కు ఉంది. తెలంగాణ సాధించిన దానికంటే సీఎం పదవి పెద్దదేమీ కాదు. రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో పంట పండకపోతే.. బండి సంజయ్ కొనుగోలు సెంటర్‎కు ఎందుకు పోయాడు. పంట ఎక్కువ పండింది కాబట్టి కొనుగోలు ఆలస్యం అవుతుంది. ఇది కేంద్ర రాష్ట్ర తగువా? ఇది టీఆర్ఎస్, బీజేపీ కొట్లాటనా? ఈ కుట్రలు కేసీఆర్ ప్రయాణాన్ని ఆపలేవు. రేపు ఏంజరుగుతుందో ఎవరికీ తెలియదు. రైంతాంగమంతా కేసీఆర్ వెంటే ఉంది. ఢిల్లీకి వెళ్ళక తప్పదు. 
ఈ కష్టాల నుంచి దేశ రైతులను కాపాడేది కేసీఆర్ మాత్రమే’ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.