నాగర్ కర్నూల్/ వనపర్తి, వెలుగు : కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని, మున్సిపల్ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. సోమవారం కొల్లాపూర్, కల్వకుర్తి పట్టణాల్లో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి, అభ్యర్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
వనపర్తిలో ఎమ్మెల్యే మెఘారెడ్డితో, నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డితో కలిసి మాట్లాడారు. నాగర్ కర్నూల్, కొల్లాపూర్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కల్వకుర్తిలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం నేతృత్వంలో భారీ బైక్ర్యాలీ చేపట్టారు.
