జనవరి, ఫిబ్రవరిలో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం

జనవరి, ఫిబ్రవరిలో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం

హైద‌రాబాద్: జాగ్రత్త ,ఐక్యమత్యం తో కరోనా ను ఎదుర్కొవాలని అన్నారు మంత్రి కిష‌న్ రెడ్డి. కరోన పట్ల ప్రధాని మోడీ చేస్తున్న సూచనలు ప్రతి ఒక్కరు పాటించాలని అన్నారు. ఆదివారం నాంప‌ల్లి బిర్లా సైన్స్ సెంటర్ లోని భాస్కర ఆడిటోరియంలో శాంతి కృష్ణ సేవ సమితి ఆధ్వర్యంలో సమాజంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి నవరత్న పురస్కారాల ప్రధానోత్సవం, ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఉపాధ్యాయదినోత్సవ వేడుకలు జ‌రిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. పలువురు ఉపాధ్యాయులతో పాటువివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి పురస్కారాల అందించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అనేక దానాలలో విద్యా దానం గొప్పదని, సమాజంలో సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. సేవ చేస్తున్న వారిని సన్మానించిన శాంతి కృష్ణ, ఐ ఫౌండేషన్ వారికి అభినందనలు తెలిపారు. ప్ర‌స్తుతం కరోన మహమ్మారి అన్ని వ్యవస్ధలను దెబ్బ తీసిందని, పండుగల సీజన్ వస్తుంది కాబట్టి.. ఈ స‌మ‌యం లో కరోనా పట్ల మరింత జాగ్రత్త అవసరమ‌ని అన్నారు. జనవరి, ఫిబ్రవరిలో కరోన వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని అన్నారు.