బండి సంజయ్ నల్ల పిల్లుల వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

బండి సంజయ్ నల్ల పిల్లుల వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

హైదరాబాద్: తాంత్రికుడి సలహాతో కేసీఆర్ ఫాంహౌజ్ లో నల్ల పిల్లులతో క్షుద్ర పూజలు చేస్తున్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కొంతమంది తాము చెప్పుకోడానికి ఏం లేక నల్లపిల్లులు, తాంత్రికులు అంటూ ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి మీరేం (కేంద్ర ప్రభుత్వం)  చేశారో చెప్పడానికి ఏం లేదు కాబట్టే ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది జీరో అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. పిచ్చోడి చేతిలో రాయి = లవంగం చేతిలో బీజేపీ అంటూ విమర్శించారు.

ఇక.. అంతకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఓ తాంత్రికుడి సలహా మేరకు ఫాంహౌజ్ లో కేసీఆర్ నల్ల పిల్లులతో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారన్నారు. పార్టీ పేరును కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్  గా మార్చింది అందులో భాగమేనని ఆరోపించారు. కేసీఆర్ క్షుద్ర పూజల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని స్వామిజీలు, వేద పండితులను  బండి సంజయ్ కోరారు.