పేరుకే మేకిన్ ఇండియా.. కానీ జాతీయ జెండాలు సైతం చైనా నుంచే దిగుమతి చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. దేశంలోని ఖాదీ పరిశ్రమ జాతీయ జెండాలను తయారు చేయగలిగే పరిస్థితుల్లో లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న మాటలపై కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం పేరుకే మేకిన్ ఇండియా అంటున్నా... కనీసం జాతీయ జెండాలను సైతం దేశంలో తయారు చేసే పరిస్థితులను సృష్టించలేదని అన్నారు. వాటిని సైతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుందని కేటీఆర్ ఎద్దేవ చేశారు.
విశ్వ గురువుగా డాంబికాలు ప్రదర్శించే కేంద్రం... 75వ భారత దేశ స్వాతంత్ర్య సంబరాలు చేస్తామని ముందే తెలిసినా, కనీసం జాతీయ జెండాలను దేశంలో తయారు చేయించాలనే ప్రణాళిక లేని పరిస్థితుల్లో కేంద్రం ఉందన్నారు. ఆత్మ నిర్భర భారత్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపైన మంత్రి కేసీఆర్ సెటైర్లు వేశారు.
Slogan - Make In India ??
— KTR (@KTRTRS) August 1, 2022
Reality - Import National flags from China for #AzadiKaAmritMahotsav ?
NPA Govt & it’s visionary VishwaGuru Ji could not even plan flags for 75th Independence Day when they knew it years ahead
Wah re Wah #atmanirbharbharat pic.twitter.com/0m6E2Ci2sJ
Claim: Promote Khadi & buy #MakeInIndia products.
— Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR) August 1, 2022
Reality: Import Polyester Flags that are #MadeInChina
Hypocrisy ki Bhi seema hoti Hain Modi ji.#BakwaasJhumlaParty @KTRTRS pic.twitter.com/2ZIV6wDWPC