అసెంబ్లీ వేదికగా కేంద్రంపై ఫైరయ్యారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో వరదలు వస్తే కేంద్రం రూపాయి సాయం చేయలేదన్నారు. కేంద్రమంత్రులు వచ్చి ఫొటోలు దిగి వెళ్లారే తప్ప చేసిందేమీ లేదన్నారు. గుజరాత్ లో వరదలు వస్తే స్వయంగా ప్రధాని వెళ్లి వెయ్యి కోట్ల సాయం ప్రకటించారని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనిపై ఒక్క మాట మాట్లాడరని మండిపడ్డారు కేటీఆర్.
మరిన్ని వార్తల కోసం