
హైదరాబాద్ లో సోలార్ రూఫ్ తో కూడిన సైక్లింగ్ ట్రాక్ ను అభివృద్ది చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇది నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. దీనికి సంబంధించిన నిర్మాణ పనులకు రేపు ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్ ) పరిధిలో శంకుస్థాపన చేస్తానని వెల్లడించారు. తొలి విడతగా 21 కి.మీ పరిధిలో సైక్లింగ్ ట్రాక్ నిర్మాణం జరుగుతుందని అన్నారు. వచ్చే ఏడాది వేసవికాలంలోగా ఈ నిర్మాణ పనులు పూర్తి చేసి సైక్లింగ్ ట్రాక్ ను అందుబాటులోకి తెస్తామని మంత్రి చెప్పారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
Had promised that we will develop a world-class, solar-roofed cycling track in Hyderabad. Laying the foundation tomorrow for an initial 21 KM
— KTR (@KTRTRS) September 5, 2022
Plan to deliver it before summer 2023 ? pic.twitter.com/YTUzvfb4XX
కాగా, ఓఆర్ఆర్ వెంట నానక్రామ్గూడ- టీఎస్పీఏ, నార్సింగి- కొల్లూరు స్ట్రెచ్లో 4.5 మీటర్ల వెడల్పులో 3 లేన్ బై-సైకిల్ ట్రాక్కు సెప్టెంబర్ 6న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని ఎంఏ అండ్ యూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్కుమార్ తెలిపారు. ఇది సీసీటీవీలతోసహా అన్ని భద్రతా ఫీచర్లతో 24/7 పని చేస్తుందని ఆయన వెల్లడించారు.
Minister @KTRTRS lays the foundation stone on Sept 6th for one of its kind 3 lane, 4.5 meters wide & 21 kms bi-cycle track along the #ORR on Nanakramguda-TSPA & Narsingi-Kollur stretch. It's solar roof topped & will work 24/7 with all safety features incl CCTVs pic.twitter.com/iWtCJFxXpU
— Arvind Kumar (@arvindkumar_ias) September 5, 2022