పొన్నాలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్

పొన్నాలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్యతో మంత్రి కేటీఆర్ భేటీ ఆయ్యారు. హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఆయనతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా పొన్నాలను పార్టీలోకి ఆహ్వానించారు.  మంత్రి కేటీఆర్ వెంట బీఆర్ఎస్  ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు.  కాగా నిన్ననే పొన్నాల బీఆర్ఎసక్ లోకి వస్తానంటే తానే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తానని కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  

కాగా 2023 అక్టోబర్ 13 న కాంగ్రెస్ పార్టీకి పొన్నాల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  తన రాజీనామా లేఖలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.  కాంగ్రెస్ లో బీసీలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు.  ఆవేదనతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా వెల్లడించారు.  బజారులో టికెట్లు అమ్ముకున్నట్లు అమ్ముతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ పార్టీని వీడారు.  కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా,  మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం పొన్నాలకు ఉంది.   తెలంగాణలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నా యి. ఈ క్రమంలో పొన్నాల పార్టీని వీడడం చర్చనీయాంశంగా మారింది.  

ALSO READ : మెగాస్టార్తో అనిల్ రావిపూడి సినిమా !