కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని మంత్రి కేటీఆర్ కలిసారు. నిన్న రాత్రి నుండి హోటల్ గ్రాండ్ కాకతీయలో బస చేస్తున్న కుమారస్వామిని మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడ ఇద్దరు బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఇందులో కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఉన్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తోకుమారస్వామి భేటీ అయ్యారు.
ఇరువురు నేతలు జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. దాదాపు సాయంత్రం 5 గంటల వరకు వీరి సమావేశం కొనసాగనుంది. ఈ ఏడాది డిసెంబర్లో కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.