పరేడ్​ గ్రౌండ్​ సభకు జనాలను భారీగా తరలించాలి

పరేడ్​ గ్రౌండ్​ సభకు జనాలను భారీగా తరలించాలి

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 17న సెక్రటేరియెట్ ప్రారంభం తర్వాత సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించే బహిరంగ సభకు జనాలను భారీగా తరలించాలని జీహెచ్​ఎంసీతో పాటు సమీప నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను కేటీఆర్​ ఆదేశించారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్​లో సెక్రటేరియెట్​ ప్రారంభోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సం దర్భంగా కేటీఆర్  మాట్లాడుతూ.. సభకు ఒక్కో నియోజకవర్గం నుంచి 10 వేల మం దిని తరలించాలన్నారు. జన సమీకరణపై ఈ నెల 13న గ్రేటర్​లోని విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించాలన్నారు.