హైదరాబాద్, వెలుగు: రాజేంద్రనగర్గోల్డెన్సిటీ కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉమర్అనే బాలుడు వినూత్న రీతిలో ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ను కోరాడు. సెల్ఫీ వీడియోను అటాచ్చేసి అందులో స్థానిక పరిస్థితి వివరించాడు. చిల్ర్డన్స్ డే సందర్భంగా అడుగుతున్నానని చేతిలో ప్లకార్డు పట్టుకొని కోరాడు. స్పందించిన మంత్రి సమస్యను పరిష్కరించాలని వాటర్బోర్డు ఎండీ దానకిశోర్ కు సూచించారు.
దానకిశోర్ వెంటనే గోల్డెన్ సిటీ కాలనీకి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. బాలుడితోపాటు కాలనీవాసులను కలిసి మాట్లాడారు. నల్లా పైప్లైన్ వేయడానికి జలమండలి రూ.2.85 కోట్లు మంజూరు చేసిందని, పలు కారణాలతో పనులు ఆలస్యమయ్యాయని తెలిపారు. రెండు వారాల్లో పనులు పూర్తిచేస్తామని, అప్పటివరకు ట్యాంకర్ల ద్వారా సరఫరా కొనసాగిస్తామని చెప్పారు.