కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా.. తహసీల్దార్కు సర్పంచ్, గ్రామస్తుల ఫిర్యాదు

కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా.. తహసీల్దార్కు సర్పంచ్,  గ్రామస్తుల ఫిర్యాదు

శివ్వంపేట, వెలుగు: మండలంలోని చండి గ్రామ శివారులో తూప్రాన్- నర్సాపూర్ రహదారి ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 334లో  కోట్ల రూపాయల విలువ చేసే 6 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ బీఆర్ఎస్ నాయకుడు కబ్జా చేశాడని దానిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని సర్పంచ్​ ప్రవీణ్​ గౌడ్​, గ్రామస్తులు తహసీల్దార్ కమలాద్రిని కోరారు. సదరు బీఆర్ఎస్​ నాయకుడు 2013లో ఫేక్ సర్టిఫికెట్​ ద్వారా రెవెన్యూ రికార్డులోకి  వచ్చాడని ఆరోపించారు.

అధికారుల దృష్టికి రాగా రికార్డ్ లో నుంచి అతడి పేరు తొలగించి ప్రభుత్వ భూమిగా నిర్ధారించారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయగా పెద్ద నాయకుల ఒత్తిడి వల్ల అధికారులు స్వాధీనం చేసుకోలేకపోయారన్నారు. ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వే చేసి హద్దులు పెట్టారన్నారు.