బీజేపీ ప్రజాస్వామ్య పోరాట చరిత్ర లేని పార్టీ

బీజేపీ ప్రజాస్వామ్య పోరాట చరిత్ర లేని పార్టీ

తెలంగాణ చరిత్రపై ఏ మాత్రం అవగాహన లేకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అల్లూరి సీతారామరాజు తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేశారంటూ ఆయన చేసిన కామెంట్స్ పై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ పోస్ట్ చేసిన ట్వీట్ ను జత చేస్తూ మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. "ప్రజాస్వామ్య పోరాట చరిత్ర లేని పార్టీ బీజేపీ. తెలంగాణ ఏర్పాటులోనే కాదు,  భారతదేశ స్వాతంత్ర్యంలోనూ వారి పాత్ర లేదు... (డబుల్ ఇంజన్) వారి యొక్క ఏకైక బలం ఝూట్ అండ్ ఝుమ్లా.. అంటే అబ‌ద్ధాలు మాట్లాడ‌టం, దాడులు చేయ‌డ‌మే"నని కేటీఆర్ కామెంట్ చేశారు. ఇదంతా కూడా వాట్సాప్ యూనివర్సిటీలో శిక్షణ పొందడం వల్ల కలిగిన దుష్పరిణామమేనని, ఓ స్మైల్ ఎమోజీని జత చేస్తూ సెటైరికల్ గా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. 

https://twitter.com/krishanKTRS/status/1532414508290830336/photo/1

 

మరిన్ని వార్తల కోసం...

35 నిమిషాల నా పాత్ర అందర్నీ ఆలోచింపజేస్తుంది

మేజర్ చిత్రానికికి విశేష స్పందన