తెలంగాణ వచ్చాకే రైతుబంధు వచ్చింది

తెలంగాణ వచ్చాకే రైతుబంధు వచ్చింది

తెలంగాణ వచ్చాకే రైతు బంధు, రైతు బీమా వచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. ప్రత్యేక రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ది జరిగిందన్నారు. సంగారెడ్డి పట్టణంలో పర్యటించిన కేటీఆర్.. స్థానిక మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. పట్టణ, పల్లె ప్రగతి కింద మున్సిపాలిటీ కార్మికులకు జీతాలు ఇస్తున్నామని చెప్పారు. రూ.200 నుంచి 2 వేలకు పెన్షన్ పెంచుకున్నామన్నారు కేటీఆర్.