ప్రతీ ఓటరు బాధ్యతగా ‘సర్’లో పాల్గొనాలి: సంగారెడ్డి కలెక్టర్

ప్రతీ ఓటరు బాధ్యతగా ‘సర్’లో పాల్గొనాలి: సంగారెడ్డి కలెక్టర్

రామచంద్రాపురం, వెలుగు: ప్రతీ ఓటరు బాధ్యతగా సర్​ ప్రక్రియలో పాల్గొనాలని సంగారెడ్డి కలెక్టర్​ప్రతీక్​ జైన్​ కోరారు. మంగళవారం తెల్లాపూర్​ డివిజన్​ పరిధిలోని కొల్లూర్​ డబుల్ బెడ్ రూమ్​ల్లో కొనసాగుతున్నసర్​ ప్రక్రియను ఆయన పరిశీలించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్​ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. ఫారాల స్వీకరణ, పత్రాల పరిశీలన, తనిఖీ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ పాండు నాయక్​, ఈఆర్​ఓ వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.