అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా సొంత డబ్బులతో అంబులెన్స్ లు డొనేట్ చేసిన మంత్రులు, నేతలు, ఇతరులు

19 అంబులెన్సులను ప్రజాసేవ కోసం జిల్లాలకు పంపించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: మంత్రి తారక రామారావు జన్మదినం సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమం కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్ అడుగు జాడల్లో గిఫ్ట్ ఎ స్మైల్ అంటూ పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇతరులు స్పందించి సొంత డబ్బులతో అంబులెన్స్ లను విరాళంగా అందించారు. మొత్తం 19 అంబులెన్స్ లు అందించగా.. వాటిని ఇవాళ ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. 19 అంబులెన్సులను వివిధ జిల్లాల్లో ప్రజల సేవ కోసం పంపించారు.

మంత్రి గంగుల కమలాకర్ రెండు, మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి  ఒక్కో అంబులెన్స్ చొప్పున అందివ్వగా, ఎమ్మెల్సీలు నవీన్ రావు,  పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పలువురు నేతలు వాసిలి చంద్రశేఖర ప్రసాద్, ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, ఎంపీ కవిత మాలోత్, ఎమ్మెల్యే సంజయ్, నడిపల్లి వెంకటరావు, వంశీ కేతినేని, ఎమ్మెల్యే జోగు రామన్న, ఎలిగంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ కి చెందిన శ్రీనాథ్ తదితరులు అంబులెన్సులను అందించారు.