
ఘట్ కేసర్, వెలుగు : మంత్రి మల్లారెడ్డి లాగా తాను మాటలతో మాయ చేసే మనిషిని కాదని.. గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్యాదవ్ తెలిపారు. సోమవారం ఘట్ కేసర్ మండలం ఔషాపూర్, మరిపెల్లిగూడెం, ఏదులాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు
మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రేశ్ యాదవ్ మాట్లాడుతూ.. ఘట్ కేసర్ మండలానికి అభివృద్ధికి మల్లారెడ్డి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలను 100 శాతం అమలు చేస్తామని ప్రకటించారు.