
మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి అందర్ని ఆకట్టుకున్నారు. ఇవాళ మేడ్చల్ లో జరిగిన హోలీ వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. అక్కడ యువతతో కలిసి డీజే టిల్లు పాటకు, చిరంజీవి వాల్తేరు వీరయ్యలోని ‘బాస్ వెర్ ఈజ్ ద పార్టీ ’పాటకు స్టెప్పులేశారు. అక్కడున్న వారు సైతం మల్లారెడ్డితో కలిసి స్టెప్పులేసి ఎంజాయ్ చేశారు.
ఈ మధ్య మల్లారెడ్డి మాట్లాడిన మాటలు, అతడు చేసిన డ్యాన్స్ లు వైరల్ అవుతున్నాయి. ఇటీవల అసెంబ్లీలో పాలమ్మిన, పూలమ్మిన అంటూ మాట్లాడిన వీడియో ఫుల్ వైరల్ అయ్యింది.