మంత్రి మల్లారెడ్డిని అడ్డుకున్న కౌన్సిలర్

మంత్రి మల్లారెడ్డిని అడ్డుకున్న కౌన్సిలర్

ఘట్​కేసర్, వెలుగు :  దళితుడిని అయినందునే వార్డు అభివృద్ధికి నిధుల కేటాయింపులో మంత్రి వివక్ష చూపారని ఇండిపెండెంట్ కౌన్సిలర్ పద్మారావు ఆరోపించారు. ఘట్ కేసర్​ మున్సిపాలిటీ పరిధి శివారెడ్డి గూడలో బుధవారం సీసీ రోడ్డు శంకుస్థాపనలో మంత్రి మల్లారెడ్డిని కౌన్సిలర్ అడ్డుకోగా పోలీసులు అరెస్ట్​చేసి స్టేషన్​కు తరలించారు. ఆయన మాట్లాడుతూ... రాజ్యాంగ పదవిలో ఉన్న మంత్రి మల్లారెడ్డి  బీఆర్ఎస్​ లీడర్​గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మున్సిపాలిటీలో18వ వార్డులు ఉండగా.. మంత్రి మాత్రం17 వార్డులకే రూ.కోటి 70 లక్షల ఎస్టీఎన్ నిధులను పరిమితం చేశారని తెలిపారు. 

బీఆర్ఎస్ లోకి రావాలని పిలిచినా వెళ్లలేదని, మనసులో పెట్టుకునే మంత్రి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా మంత్రి వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం కౌన్సిలర్​కు ఎంపీపీ ఏనుగు సుదర్శన్​రెడ్డి, లీడర్లు కల్లూరి జయచంద్ర, తాబ్ది ఈశ్వర్, వార్డు ప్రజలు మద్దతుగా నిలిచారు.