గొర్లు కాసిన మంత్రి మల్లారెడ్డి

గొర్లు కాసిన మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రామ్​కు మంత్రి మల్లారెడ్డి చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు. లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేశాక గొంగడి కప్పుకుని.. చేతిలో కట్టె పట్టుకుని సరదాగా కాసేపు గొర్రెలు కాశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్లారెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మేడ్చల్ మండలానికి మొత్తం 15 యూనిట్లు కేటాయించామని తెలిపారు. ఒక్కో యూనిట్​లో 21 గొర్రెలు ఉంటాయన్నారు. తెలంగాణలో మాంసానికి ఎక్కువ డిమాండ్ ఉందని వివరించారు.
‑ మేడ్చల్, వెలుగు