గుర్రమెక్కి ఫోటోలకు ఫోజులిచ్చిన మంత్రి మల్లారెడ్డి

గుర్రమెక్కి ఫోటోలకు ఫోజులిచ్చిన మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు. మామూలు రోజుల్లోనే వార్తల్లో నిలిచే మంత్రి మల్లారెడ్డి.. మరి తన పుట్టిన రోజున ఊరికే ఉంటారా ? తన పుట్టిన రోజున అభిమానుల కోరిక మేరకు మంత్రి మల్లారెడ్డి గుర్రమెక్కారు. ఇక వివరాల్లోకి వెళ్తే... ఇవాళ మంత్రి మల్లారెడ్డి బర్త్ డే కావడంతో బోయిన్ పల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయానికి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున   తరలివచ్చారు. ఈ క్రమంలోనే కొంతమంది వీరాభిమానులు మంత్రి మల్లారెడ్డి వద్దకు గుర్రాన్ని తీసుకొచ్చారు.

తర్వాత మంత్రిని ఆ గుర్రం ఎక్కాలని  కోరారు. అభిమానుల కోరిక మేరకు మంత్రి మల్లారెడ్డి గుర్రమెక్కారు. వాళ్లను ఖుషీ చేసేందుకు గుర్రం మీద కూర్చొని ఫోటోలకు మంచి ఫోజులు కూడా ఇచ్చారు. ఆయన అలా గుర్రమెక్కి ఫోజలు పెడతోంటే... క్యాంపు కార్యాలయం మొత్తం జై మల్లన్న నినాదాలతో మారుమోగింది. .