- అన్నిరంగాలను అభివృద్ధి చేశాం .. ‘మీట్ ద ప్రెస్’ లో మంత్రి మల్లారెడ్డి
ఖైరతాబాద్,వెలుగు: దేశాన్ని, రాష్ట్రాన్ని 56 ఏళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్తో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఒకప్పుడు ఐటీ పేరు చెబితే బెంగళూరు గుర్తుకు వచ్చేది. కేటీఆర్ఐటీ మంత్రి అయిన తర్వాత ఐటీకి కేరాఫ్అడ్రస్హైదరాబాద్ అయింది. కాంగ్రెస్ అంటే స్కాం, కరువు, కేసీఆర్అంటే నీళ్లు.. ఆయన వచ్చాకే తాగు, సాగు నీరుకు ఇబ్బంది లేదు’’.. అని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’లో మంత్రి పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ ఆవిర్భావం అనంతరం దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగామని, ఇదంతా సీఎం కేసీఆర్వల్లే సాధ్యమైందన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిందని, బస్తీ దవాఖానాల ఏర్పాటు, ప్రయివేట్విద్యాసంస్థలకు దీటుగా రూ.730 కోట్లతో అన్ని సదుపాయాలతో కాలేజీలు, పాఠశాలలను అభివృద్ధి చేసిందని చెప్పారు. రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నడు. అందుకే ఎమ్మెల్యే టిక్కెట్లను అమ్ముకుంటుండని, మేడ్చల్ఎంపీగా గెలిచి ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాలేదని మంత్రి విమర్శించారు. ప్రెస్ క్లబ్అధ్యక్షుడు వేణుగోపాల్నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రెస్క్లబ్కార్యవర్గం పాల్గొంది. అనంతరం కొందరు జర్నలిస్టులు మంత్రికి కొన్ని ప్రశ్నలు వేశారు. అవి..
ప్రశ్న : బోడుప్పల్లోని ఓ వెంచర్లో కొనుగోలు చేసి స్థలాల్లో రిజిస్ట్రేషన్చేసుకుని ఇళ్లు కట్టుకుంటే వక్ఫ్ భూములంటూ కేసులు వేశారు ?
మంత్రి : అవును నిజమే నా వద్దకు వచ్చింది. ఎప్పుడో పాత డాక్యుమెంటుతో కోర్టులో కేసు వేశారు. ఎన్నికల అనంతరం దానిపై దృష్టి పెడతా.
ప్రశ్న: మీ కాలేజీ సమీపంలో 40 ఎకరాల భూమిని కబ్జా చేసి మీ కొడుకు పేరుపై పెట్టారు. దానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి.?
మంత్రి : అవన్నీ ఎన్నికల ముందు గిట్టని వారు అంటారు. పాలమ్మి, పూలమ్మి నిజాయతీగా సంపాదించా. అందరి కంటే ఒక వేయి ఎక్కువిచ్చి కొన్నా. నాకు 800 ఎకరాల భూమి ఉంది. అందులో 5 00 ఎకరాల్లో కాలేజీలు కట్టాను. ఆధారాలు ఉంటే తీసుకురా..? అని మంత్రి ఎదురు ప్రశ్నించారు.
ప్రశ్న : రైల్వే బ్రిడ్జిలు నిర్మాణం పూర్తి కాలేదు.
మంత్రి : కొంపల్లి, ఘట్కేసర్, మేడ్చల్లో అన్నీ అండర్పాస్లు తెచ్చా.. కావాలంటే నావెబ్సైట్ను చూడొచ్చు.