పాతబస్తీ మహిళలను విదేశాలకు తరలిస్తున్రు : మీనాక్షి లేఖి

పాతబస్తీ మహిళలను విదేశాలకు తరలిస్తున్రు :   మీనాక్షి లేఖి

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగాలు, ఉపాధి పేరుతో పాతబస్తీ మహిళలను మోసగిస్తూ కొందరు అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ఆరోపించారు. శుక్రవారం సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్ లో ఆమె మాట్లాడారు. తప్పుడు వీసాలు సృష్టించి, కొంతమంది ట్రావెలింగ్ ఏజెంట్లు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.

మోసగాళ్లను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. దీంతో మహిళల అక్రమ రవాణా తగ్గిందని చెప్పారు. ఇలాంటి అక్రమార్కులకు కొన్ని రాజకీయ పార్టీలు అండగా నిలవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ మోసగాళ్ల చేతిలో మహిళలు చిక్కకుండా చూస్తున్నామన్నారు. కేసీఆర్, ఓవైసీలే ప్రజలను విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఈ ఇద్దరికీ తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.