
- స్టార్టప్20 శిఖర్ సమ్మిట్లో పీయూష్ గోయల్
గురుగ్రామ్: స్టార్టప్ ఎకో సిస్టమ్పటిష్టం చేయడానికి ప్రభుత్వం ఫెసిలిటేటర్గానే వ్యవహరిస్తుందని, రెగ్యులేటర్గా కాదని కామర్స్, ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ మంగళవారం వెల్లడించారు. ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్లోని స్టేక్హోల్డర్లే సెల్ఫ్రెగ్యులేషన్తో వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. గురుగ్రామ్లో జరిగిన స్టార్టప్20 సమ్మిట్లో పీయూష్ గోయల్ మాట్లాడారు. స్టార్టప్ ల ప్రోగ్రెస్కు ప్రభుత్వాలు అడ్డుపడకూడదనే మెసేజ్ను సమ్మిట్లో పాల్గొంటున్న 22 దేశాలు గుర్తించి, కమిట్మెంట్తో పనిచేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. స్టార్టప్ ఎకో సిస్టమ్లో జోక్యం చేసుకోకుండా ఉండటమే సరయిన చర్య అవుతుందని ఆయన పేర్కొన్నారు.
స్టార్టప్ ఎకో సిస్టమ్ను ప్రభుత్వం రెగ్యులేట్ చేయదని, డిక్టేట్చేయదని, అలాగే మైక్రో–మేనేజ్మెంట్కు కూడా పాల్పడదని గోయల్ చెప్పారు. స్టార్టప్ ఎకో సిస్టమ్కు కేవలం ఫెసిలిటేటర్గానే ప్రభుత్వం వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు. ఎదుగుతున్న ఎంట్రప్రెనూర్లకు తొలి దశలో అవసరమైన ఫండింగ్ ఇవ్వడం, చేయూతను అందించడం మాత్రమే ప్రభుత్వం చేస్తుందని పేర్కొన్నారు. స్టార్టప్ ప్రపంచానికి ఇండియా అపూర్వమైన అవకాశాలు కల్పిస్తుందని వెల్లడించారు. మన దేశంలో నిపుణులకు కొదవలేదని, స్టార్టప్ కల్చర్ జోరందుకుంటోందని, ఎదగాలనుకునే వారి సంఖ్యా ఎక్కువేనని కామర్స్ మినిస్టర్ పేర్కొన్నారు.
ఇండియాలో ఆపర్చునిటీస్ చూడండి..
విదేశీ స్టార్టప్లకు ఆహ్వానం
ఇండియా వచ్చి ఇక్కడి అవకాశాలను పరిశీలించాల్సిందిగా వివిధ దేశాలలోని స్టార్టప్లను పీయూష్ గోయల్ ఆహ్వానించారు. జీ20 దేశాలకు ప్రెసిడెన్సీ వహిస్తున్న నేపథ్యంలో ఇండియా ఈ స్టార్టప్20 శిఖర్ సమ్మిట్ను నిర్వహించింది. సోమవారం ఈ సమ్మిట్ మొదలైంది. ఒకవేళ స్టార్టప్ ఎకో సిస్టమ్లో ఏవైనా సమస్యలున్నా, సవాళ్లున్నా వాటికి పరిష్కారాలను కనుక్కునే ప్రయత్నాలను ప్రభుత్వ పరంగా తాము చేస్తామని మంత్రి చెప్పారు. సెల్ఫ్రెగ్యులేషన్తోనే ఎకో సిస్టమ్ నడిచేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిలకడగా ఎదిగేలా ఎకో సిస్టమ్ను వారే ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తామని గోయల్ అన్నారు. గ్రోత్, ఎకౌంటింగ్, ఫైనాన్సింగ్, రిపోర్టింగ్ వంటి అంశాలలో సెల్ఫ్ రెగ్యులేషన్కు పెద్ద పీట వేస్తామని చెప్పారు. స్టార్టప్ ప్రపంచంలో జోక్యం కూడదని వ్యక్తిగతంగానూ తాను నిర్ణయించుకుంటున్నట్లు పేర్కొన్నారు. సమ్మిట్లో డిస్కషన్స్ ద్వారా వచ్చిన రికమెండేషన్లు స్టార్టప్ ఎకో సిస్టమ్కు ఫౌండేషన్గా నిలుస్తాయని చెప్పారు. ఫలితంగా స్టార్టప్ జర్నీ స్టార్టప్ ఇండియా నుంచి స్టార్టప్ వరల్డ్కి ఇది దారి తీస్తుందనే ఆశాభావాన్ని పీయూష్ గోయల్ వ్యక్తం చేశారు.
2030 నాటికి గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టమ్ 1 ట్రిలియన్ డాలర్లకు చేరేందుకు అవసరమైన పెట్టుబడులను ఏటా జీ 20 దేశాలు పెట్టాలని నిర్ణయించినట్లు కూడా మంత్రి వెల్లడించారు. స్టార్టప్ ఎకో సిస్టమ్లోకి పబ్లిక్, పెట్టుబడులు వెల్లువెత్తేలా చొరవ తీసుకోవాలని ఆయన లీడర్లను కోరారు. ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏర్పాటు, కార్పొరేట్ వెంచర్ ఫండ్స్, యూనివర్శిటీ ఎండోమెంట్ ఫండ్స్ వంటి మెకానిజమ్లను ఇందుకోసం వాడుకోవచ్చని సూచించారు. ఈ తాజా మిషన్లో భాగం పంచుకునేందుకు మొదటి భాగస్వామిగా సౌదీ అరేబియా ముందుకు వచ్చినట్లు స్టార్టప్ 20 ఇండియా చైర్మన్, అటల్ ఇన్నొవేషన్ మిషన్ డైరెక్టర్ చింతన్ వైష్ణవ్ వెల్లడించారు. జీ 20 దేశాలలోని స్టార్టప్లు అన్నింటికీ వర్తించేలా ఒక కామన్ ఫ్రేమ్వర్క్ తేవాలని సమ్మిట్లో నిర్ణయించారు.