స్టార్టప్​లకు మేం ఫెసిలిటేటర్లమే.. రెగ్యులేటర్లం కాదు

స్టార్టప్​లకు మేం ఫెసిలిటేటర్లమే..  రెగ్యులేటర్లం కాదు
  • స్టార్టప్​20 శిఖర్​ సమ్మిట్​లో పీయూష్​ గోయల్​

గురుగ్రామ్​: స్టార్టప్​ ఎకో సిస్టమ్​పటిష్టం చేయడానికి ప్రభుత్వం ఫెసిలిటేటర్​గానే వ్యవహరిస్తుందని, రెగ్యులేటర్​గా కాదని కామర్స్​, ఇండస్ట్రీ మినిస్టర్​ పీయూష్​ గోయల్​ మంగళవారం వెల్లడించారు. ఈ స్టార్టప్​ ఎకో సిస్టమ్​లోని స్టేక్​హోల్డర్లే సెల్ఫ్​రెగ్యులేషన్​తో వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. గురుగ్రామ్​లో జరిగిన స్టార్టప్​20 సమ్మిట్​లో పీయూష్​ గోయల్​​ మాట్లాడారు. స్టార్టప్ ల ప్రోగ్రెస్​కు ప్రభుత్వాలు అడ్డుపడకూడదనే మెసేజ్​ను సమ్మిట్​లో పాల్గొంటున్న 22 దేశాలు గుర్తించి, కమిట్​మెంట్​తో పనిచేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. స్టార్టప్​ ఎకో సిస్టమ్​లో జోక్యం చేసుకోకుండా ఉండటమే సరయిన చర్య అవుతుందని ఆయన పేర్కొన్నారు. 

స్టార్టప్​ ఎకో సిస్టమ్​ను ప్రభుత్వం  రెగ్యులేట్​ చేయదని, డిక్టేట్​చేయదని, అలాగే మైక్రో–మేనేజ్​మెంట్​కు కూడా పాల్పడదని గోయల్​​ చెప్పారు. స్టార్టప్​ ఎకో సిస్టమ్​కు కేవలం ఫెసిలిటేటర్​గానే ప్రభుత్వం వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు. ఎదుగుతున్న ఎంట్రప్రెనూర్లకు తొలి దశలో అవసరమైన ఫండింగ్​ ఇవ్వడం, చేయూతను అందించడం మాత్రమే ప్రభుత్వం చేస్తుందని పేర్కొన్నారు. స్టార్టప్​ ప్రపంచానికి ఇండియా అపూర్వమైన అవకాశాలు కల్పిస్తుందని వెల్లడించారు. మన దేశంలో నిపుణులకు కొదవలేదని, స్టార్టప్​ కల్చర్​ జోరందుకుంటోందని, ఎదగాలనుకునే వారి సంఖ్యా ఎక్కువేనని కామర్స్​ మినిస్టర్​ పేర్కొన్నారు.

ఇండియాలో ఆపర్చునిటీస్​ చూడండి.. 
విదేశీ స్టార్టప్​లకు ఆహ్వానం

ఇండియా వచ్చి ఇక్కడి అవకాశాలను పరిశీలించాల్సిందిగా వివిధ దేశాలలోని స్టార్టప్​లను పీయూష్​ గోయల్​ ఆహ్వానించారు. జీ20 దేశాలకు ప్రెసిడెన్సీ వహిస్తున్న నేపథ్యంలో ఇండియా ఈ స్టార్టప్​20 శిఖర్​ సమ్మిట్​ను నిర్వహించింది. సోమవారం ఈ సమ్మిట్​ మొదలైంది. ఒకవేళ స్టార్టప్​ ఎకో సిస్టమ్​లో ఏవైనా సమస్యలున్నా, సవాళ్లున్నా వాటికి పరిష్కారాలను కనుక్కునే ప్రయత్నాలను ప్రభుత్వ పరంగా తాము చేస్తామని మంత్రి చెప్పారు.  సెల్ఫ్​రెగ్యులేషన్​తోనే ఎకో సిస్టమ్​ నడిచేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిలకడగా ఎదిగేలా ఎకో సిస్టమ్​ను వారే ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తామని గోయల్​ అన్నారు. గ్రోత్​, ఎకౌంటింగ్​, ఫైనాన్సింగ్​, రిపోర్టింగ్​ వంటి అంశాలలో సెల్ఫ్​ రెగ్యులేషన్​కు పెద్ద పీట వేస్తామని చెప్పారు. స్టార్టప్ ​ప్రపంచంలో జోక్యం కూడదని వ్యక్తిగతంగానూ తాను నిర్ణయించుకుంటున్నట్లు పేర్కొన్నారు. సమ్మిట్​లో డిస్కషన్స్​ ద్వారా వచ్చిన రికమెండేషన్లు స్టార్టప్​ ఎకో సిస్టమ్​కు ఫౌండేషన్​గా నిలుస్తాయని చెప్పారు. ఫలితంగా స్టార్టప్​ జర్నీ స్టార్టప్​ ఇండియా నుంచి స్టార్టప్​ వరల్డ్​కి ఇది దారి తీస్తుందనే ఆశాభావాన్ని పీయూష్​ గోయల్​​ వ్యక్తం చేశారు. 

2030 నాటికి గ్లోబల్​ స్టార్టప్​ ఎకో సిస్టమ్​ 1 ట్రిలియన్​ డాలర్లకు చేరేందుకు అవసరమైన పెట్టుబడులను ఏటా  జీ 20 దేశాలు పెట్టాలని నిర్ణయించినట్లు కూడా మంత్రి వెల్లడించారు. స్టార్టప్​ ఎకో సిస్టమ్​లోకి పబ్లిక్​, పెట్టుబడులు వెల్లువెత్తేలా చొరవ తీసుకోవాలని ఆయన లీడర్లను కోరారు. ఫండ్​ ఆఫ్​ ఫండ్స్​ ఏర్పాటు, కార్పొరేట్​ వెంచర్​ ఫండ్స్​, యూనివర్శిటీ ఎండోమెంట్​ ఫండ్స్​ వంటి మెకానిజమ్​లను ఇందుకోసం వాడుకోవచ్చని సూచించారు. ఈ తాజా మిషన్​లో భాగం పంచుకునేందుకు మొదటి భాగస్వామిగా సౌదీ అరేబియా ముందుకు వచ్చినట్లు స్టార్టప్​ 20 ఇండియా చైర్మన్​, అటల్​ ఇన్నొవేషన్​ మిషన్​ డైరెక్టర్​ చింతన్​ వైష్ణవ్​ వెల్లడించారు. జీ 20 దేశాలలోని స్టార్టప్​లు అన్నింటికీ వర్తించేలా ఒక కామన్​ ఫ్రేమ్​వర్క్​ తేవాలని సమ్మిట్లో నిర్ణయించారు.