మధిరలోమంత్రి పొంగులేటి పర్యటన

 మధిరలోమంత్రి పొంగులేటి పర్యటన

మధిర, వెలుగు:  మధిర మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పలు ప్రైవేటు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆత్కూరు గ్రామానికి చెందిన  ఖమ్మంపాటి సురేశ్ ​వివాహా వేడుకకు హాజరై  నూతనవధూవరులను ఆశీర్వదించారు.  ఇల్లూరు గ్రామ మాజీ సర్పంచ్ రామారావు కుమారుడిని ఆశీర్వదించారు. సిద్దినేనిగూడెం గ్రామంలో వేమిరెడ్డి లక్ష్మారెడ్డి మృతి చెందగా  వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సైదల్లీపురం గ్రామానికి చెందిన రిటైర్డ్​ ఉపాధ్యాయులు నెల్లూరు పెద్ద పుల్లయ్యను పరామర్శించారు. 

మంత్రి వెంట జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాంబాబు, డీసీసీబీ  డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి,  కాంగ్రెస్​ పార్టీ మధిర మండల, పట్టణ  అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, మిర్యాల వెంకటరమణగుప్తా, సొసైటీ ప్రెసిడెంట్ కటికల సీతారామిరెడ్డి, దేవిశెట్టి రంగారావు, యన్నం కోటేశ్వరరావు, అమరవాది సత్యనారాయణ రెడ్డి, బాలు, లక్ష్మారెడ్డి తదితరులు  పాల్గొన్నారు.