ఏదులాపురాన్ని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

ఏదులాపురాన్ని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 
  •   పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం రూరల్ మండలం లో కొత్తగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీని దేశంలోనే అత్యుత్తమ మున్సిపాలిటీగా తీర్చిద్దుతానని  రాష్ట్ర రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదవాడి కష్టాలు తెలిసిన ఇందిరమ్మ ప్రభుత్వం ఎవరికీ నష్టం చేయదని, అర్హులందరికీ ఇండ్లు, సన్నబియ్యం, ఇతర పథకాలన్నీ అమలు అవుతాయని తెలిపారు.

అంతుకుముందు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నాయుడుపేట జంక్షన్ వద్ద రూ. 4 కోట్లతో ఖమ్మం మహబూబాబాద్ ఫోర్ లైన్ రోడ్డు విస్తరణ పనులకు, పెద్దతండాలో ఖమ్మం–సూర్యాపేట రోడ్డు నుంచి చల్లపల్లి గార్డెన్ వరకు రూ.50 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డుకు, గుదిమల్ల గ్రామం వాటర్ ట్యాంక్ నుంచి బోడగుట్ట దొంక వరకు నిర్మించనున్న బీటీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్ బీ ఎస్ఈ వి.యుగేందర్, ఆర్డీవో నరసింహారావు, ఎదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.