
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: హుస్నాబాద్ కు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) మంజూరైనట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం తెలిపారు. దీనిని హుస్నాబాద్ మండలం తోటపల్లిలో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. హుస్నాబాద్ కి ఏటీసీ సెంటర్ తీసుకొచ్చేందుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు నియోజక వర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఏటీసి నిర్మాణం కోసం రూ,45.15 కోట్లు ఖర్చు చేయనున్నారు.