చేనేత రంగాన్ని కాపాడండి..కాటన్ ని ప్రోత్సహించండి:మంత్రి పొన్నం

చేనేత రంగాన్ని కాపాడండి..కాటన్ ని ప్రోత్సహించండి:మంత్రి పొన్నం

తెలంగాణలో చేనేత రంగాన్ని కాపాడాలని.. కాటన్ ని ప్రోత్సహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఏప్రిల్ 15వ తేదీ సోమవారం  చేనేత రంగాన్ని కాపాడాలని మంత్రి వీడియో సందేశం ద్వారా పిలుపునిచ్చారు. 

మీరు ఎప్పుడైనా అతిరథులను, పెద్దలను సన్మానించాలనుకుంటే.. శాలువాలు, బొకేలకు బదులు నేతన్నలు నేసిన కాటన్ వస్త్రాలతో సన్మానించాలని మంత్రి తెలిపారు. ఈ రకంగా చేస్తే చేనేతలను ప్రోత్సహించినట్టు అవుతుందని అన్నారు మంత్రి. మంత్రులను, రాజకీయ నాయకులను సన్మానించే వాళ్ళు బొకేలు శాలువాలతో కాకుండా పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు,పెన్నులు ఇచ్చి సన్మానించాలని అన్నారు మంత్రి పొన్నం.