కేసీఆర్ సలహాతోనే బండి సంజయ్ ను తప్పించారు: మంత్రి పొన్నం

 కేసీఆర్ సలహాతోనే బండి సంజయ్ ను తప్పించారు: మంత్రి పొన్నం

అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు పథకాలు అమలు చేశామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జనవరి 6వ తేదీ శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజాపాలన మొదలైందన్నారు. దీనిని బీఆర్ఎస్ ఓవర్వలేకపోతోందని..  సక్సెస్ స్కీంను బీఆర్ఎస్  విమర్శిస్తోందని ఆయన మండిపడ్డారు.

మహాలక్ష్మీ స్కీంకు మంచి స్పందన వస్తోందని.. కానీ,  బీఆర్ఎస్ ఆటో డ్రైవర్లను బీఆర్ఎస్ రెచ్చగొడుతోందని ఫైర్ అయ్యారు. నెల రోజుల ప్రభుత్వాన్ని 420 అని బద్నాం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్, కిషన్ రెడ్డి వేర్వేరు కాదని.. కిషన్ రెడ్డి, ముమ్మాటికీ కేసీఆర్ కు బినామీనేనన్నారు. కేసీఆర్ సలహాతోనే బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారని మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు చేశారు.