కవితకు టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం

కవితకు టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం

టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం అందజేశారు. హైటెక్స్ లోని  కవిత ఇంటికి వెళ్లి మంత్రి వేముల పార్టీ క్రియాశీల సభ్యత్వ రశీదును ఆమెకు అందజేశారు. అనంతరం మంత్రి  మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా చురుగ్గా సాగుతోందన్నారు.

పార్టీ నిర్దేశించిన లక్ష్యము కంటే ఎక్కువ సభ్యత్వ నమోదు అవుతుందని ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ పట్ల కేసీఆర్ నాయకత్వం పట్ల  పూర్తి విశ్వాసం ఉందనడానికి ఇది నిదర్శనం అని మంత్రి అన్నారు. తెలంగాణ హక్కులు కాపాడటం ప్రజల ప్రయోజనాలు నెరవేర్చడం ఒక్క టీఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యమని అందుకే పార్టీ పై ప్రజల్లో ఉన్న నమ్మకం తోనే పెద్ద ఎత్తున ప్రజలు పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.