ఫ్రీ డ్రైవింగ్ ​లైసెన్స్ మేళా షురూ

ఫ్రీ డ్రైవింగ్ ​లైసెన్స్ మేళా షురూ

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ఖమ్మం సిటీలోని తన క్యాంప్​ఆఫీసులో మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ శుక్రవారం ఫ్రీ డ్రైవింగ్​లైసెన్స్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 23 వరకు కొనసాగే లైసెన్స్​మేళాను18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి హరీశ్​రావు సూచనల మేరకు ఈ మేళాను ప్రారంభించినట్లు చెప్పారు. మొత్తం ఖర్చును పువ్వాడ ఫౌండేషన్​భరిస్తుందని తెలిపారు. అనంతరం స్లాట్ బుక్​చేసుకున్న వారికి ఎల్ఎల్ఆర్​అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్​కుమార్, పగడాల నాగరాజు, ఆర్టీఓ కిషన్​రావు, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, మగ్బూల్, మందడపు  లక్ష్మి, దండా జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తమను మినహాయించాలని వినతి

ఖమ్మం టౌన్, వెలుగు : వైద్య ఆరోగ్యశాఖలోని ఉద్యోగులకు జీపీఎస్​ఆధారిత ఫేస్​రికగ్నైజేషన్ అటెండెన్స్​నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్.అఫ్జల్ హసన్, ఆర్.వి.ఎస్.సాగర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు మంత్రి పువ్వాడ అజయ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఖమ్మం జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన విధానంతో ఫీల్డ్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే వెటర్నరీ డిపార్ట్​మెంట్ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. మంత్రి స్పందిస్తూ ఇప్పటికే వైద్యశాఖ కమిషనర్ శ్వేతామహంతితో మాట్లాడానని, మంత్రి హరీశ్​రావు, సీఎస్​దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు.