
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు దర్శించుకున్నారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ కుటుంబ సభ్యులతో కలిసి మల్లికార్జున స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక అర్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత శ్రీ భ్రమరాంబ ఆలయంలో అమ్మ వారిని దర్శించుకుని తులసి పూజా జరిపించారు. అంతకు ముందు అలయ అధికారులు, ప్రదాన అర్చకులు పువ్వాడ అజయ్ దంపతులకు శాస్త్రోతంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. ఆ తర్వాత స్వామి వారి శేషవస్త్రం కప్పి, వేద పండితుల ఆశీర్వాదం అందించారు. ఆలయాధికారులు స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.