ధరలు పెంపుతో పేదల కష్టాలు

ధరలు పెంపుతో పేదల కష్టాలు

చేవెళ్ల: గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరిగిన వంట గ్యాస్ ధరలకు తగ్గించాలని బడంగ్ పేట్ కార్పొరేషన్ నుంచి బాలాపూర్ చౌరస్తా వరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నా చేపట్టారు. ‘‘మోదీజీ సిలిండర్ తీసుకుపో, కట్టెల పొయ్యి ఇచ్చిపో’’ అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం డీజిల్, గ్యాస్ సిలిండర్ నిత్యావసర ధరలు పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం పై మహిళలు పెద్ద  తెరగబడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం...

‘సైకిల్’కు మళ్లీ పెరుగుతున్న క్రేజ్ 

సార్ పాస్ చేయండి.. లేకపోతే పెళ్లి చేస్తారు.. విద్యార్థుల వింత కోరికలు

క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వరకూ కాంగ్రెస్ పాద‌యాత్ర