పేపర్ లీక్ పై మంత్రి సబిత సీరియస్..ఉద్యోగాల నుంచి తొలగిస్తం: సబితా ఇంద్రారెడ్డి

పేపర్ లీక్ పై మంత్రి సబిత సీరియస్..ఉద్యోగాల నుంచి తొలగిస్తం: సబితా ఇంద్రారెడ్డి

 టెన్త్ పేపర్ ఎగ్జామ్ నిర్వాహణలో అక్రమాలకు పాల్పడితే ఉద్యోగులను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ  వదిలిపెట్టే ప్రసక్తే లేదని  హెచ్చరించారు. పరీక్షా పేపర్లు లీక్ కాలేదని.. విద్యార్థులు, తల్లి తండ్రులు ఆందోళన చెందవద్దని  విజ్ఞప్తి  చేశారు. ఈ పరీక్షల విషయంలో తమ స్వార్ధ ప్రయోజనాలకై విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.  ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీ లకు సూచించారు.

టెన్త్ పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ లు, ఎలక్ట్రానిక్ ఎగ్జామ్ సెంటర్లోకి  అనుమతించవద్దని,  పరీక్షల విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని  స్పష్టంచేశారు.  పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను పటిష్టంగా అమలు చేయడంతోపాటు జిరాక్స్ షాప్ లను మూసివేయించాలని అన్నారు. పరీక్షా పేపర్ల రవాణా విషయంలో మరింత భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.