వైఎస్ షర్మిలపై మంత్రి సత్యవతి ఫైర్

వైఎస్ షర్మిలపై మంత్రి సత్యవతి ఫైర్

ప్రజలచేత రెండు సార్లు ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవితలను వైఎస్ షర్మిల ఇష్టం వచ్చినట్లు విమర్శించడం సరికాదని మంత్రి సత్యావతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే, ఎంపీలపై షర్మిల చేసిన అనుచిత వాఖ్యలపై ఆమె స్పందించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లు ఏ ముఖం పెట్టుకొని ఈ ప్రాంతంలో తిరుగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా వైఎస్ కుటుంబం కోట్ల రూపాయలు ఆర్జించి కొత్త పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి ఉరేగుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసేవ కోసమే ఇతర పార్టీల నుండి ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ లో చేరుతున్నారు..కానీ మిలాగా అక్రమ సంపాదన కోసం కాదని మంత్రి సత్యవతి విమర్శించారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్ద.. నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పేదల అభివృద్ధియే ధ్యేయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.