ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా స్టెప్పులేస్తూ తరలి వెళ్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి సభకు బయలుదేరిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు తీన్మార్ స్టెప్పులు వేశారు. కార్యకర్తలతో కలిసి ఆడి వారిలో ఉత్సాహం నింపారు.