- వాటివల్లే ములుగు మున్సిపాలిటీలో 4 స్థానాల్లో ఓడిపోయాం : మంత్రి సీతక్క
ములుగు, వెలుగు: కాంగ్రెస్లో వెన్నుపోటు రాజకీయాలను సహించేది లేదని, పార్టీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం ములుగులోని ఓ ఫంక్షన్ హాల్లో మున్సిపల్చైర్ పర్సన్ చింతనిప్పుల చంద్రకళ భిక్షపతి, వైస్చైర్పర్సన్ఆసియా, కౌన్సిలర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు కృతజ్క్షతలు తెలిపారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అన్ని అంశాలను పరిశీలించి చైర్ పర్సన్గా చంద్రకళను ఎంపిక చేశామన్నారు.
చైర్పర్సన్ పదవి రాలేదని కౌన్సిలర్లు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో అందరికీ అవకాశాలు వస్తాయని చెప్పారు. ములుగు మున్సిపాలిటీలో 4 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోవడానికి వెన్నుపోటు రాజకీయాలే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీలో ఉండి మోసం చేయడం క్షమించరాని నేరమని, అలాంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. ఎవరు ఈ పని చేశారో తమకు తెలుసని, పద్ధతి మార్చుకోవాలని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్, నాయకులు పాల్గొన్నారు.
