
- ఇందిరమ్మ ఇండ్లను స్పీడప్ చేయాలి
- నకిలీ సీడ్స్ అమ్మేవారిపై పీడీ యాక్ట్ పెట్టాలి
- గ్రామాల్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీలు వేయాలి
- మంచిర్యాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రివ్యూ మీటింగ్
మంచిర్యాల, వెలుగు: పది, ఇరవై ఏండ్లుగా సాగులో ఉన్న పోడు భూముల జోలికి పోవద్దని, ఆదివాసీ గిరిజన రైతులను ఫారెస్టు ఆఫీసర్లు ఇబ్బంది పెట్టొద్దని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఆదేశించారు. శనివారం మంచిర్యాల కలెక్టరేట్లో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా రివ్యూ మీటింగ్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, వానాకాలం సీజన్కు సన్నద్ధతతో పాటు ఇతర స్కీమ్ లపై మంత్రి సమీక్షించారు.
ఫారెస్టు భూముల పేరిట ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అడ్డుపడుతున్నారని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె స్పందిస్తూ దశాబ్దాలుగా రైతులు దున్నుకుంటున్న భూముల జోలికి వెళ్లొద్దని, ఈ పంట సీజన్ పూర్తయిన తర్వాత ఫారెస్టు, రెవెన్యూ జాయింట్సర్వే చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎక్కువ ఇండ్లు వచ్చాయని, ట్రైబల్ ఏరియాకు 12 వేలు అదనంగా ఇచ్చామన్నారు. వెంటనే ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈసారి ముందస్తు వానలతో ఖరీఫ్ సీజన్ మొదలైందని యాక్షన్ప్లాన్ రెడీ చేసుకొని విత్తనాలు, ఎరువులతో సిద్ధంగా ఉండాలన్నారు.
ఫర్టిలైజర్స్డీలర్లతో జిల్లాల వారీగా మీటింగ్ లు ఏర్పాటుచేసి నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వార్నింగ్ ఇవ్వాలన్నారు. ప్రతి గ్రామంలో ఫ్లడ్ మేనేజ్మెంట్కమిటీలు ఏర్పాటు చేసుకోని ముంపు నివారణ చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. రివ్యూ మీటింగ్ కలెక్టర్ కుమార్ దీపక్అధ్యక్షతన నిర్వహించగా.. ఉమ్మడి ఎమ్మెల్సీలు దండె విఠల్, మల్క కొమురయ్య, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, బి.రామారావు పటేల్, జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతితో పాటు అధికారులు పాల్గొన్నారు.