V6 News

ప్రజల  ఆకాంక్షల మేరకు అభివృద్ధి పనులు : మంత్రి సీతక్క

ప్రజల  ఆకాంక్షల మేరకు అభివృద్ధి పనులు : మంత్రి సీతక్క
  • వెంకటాపూర్​ మండలంలో పెద్దమ్మగుడి ప్రారంభం

ములుగు, వెంకటాపూర్​(రామప్ప), వెలుగు :  ప్రజా అభీష్టం మేరకు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర  మంత్రి దనసరి అనసూయ  అన్నారు. సోమవారం ములుగు, వెంకటాపూర్​ మండలాల్లో పర్యటించి  చలివేంద్రంతో పాటు  వెంకటాపూర్​ లో రూ.30లక్షల పీఆర్​ నిధులతో నిర్మించిన పెద్దమ్మగుడిని ప్రారంభించారు.  

అనంతరం మండలంలోని లక్ష్మీదేవిపేటలో రామాలయ గుడి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్​ సర్పంచ్​ మాడిశెట్టి సుగుణ స్వామి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ బానోతు రవిచందర్​, పంచాయతీరాజ్​ రాష్ట్ర డైరెక్టర్​ బైరెడ్డి భగవాన్​ రెడ్డి, కాంగ్రెస్​ వెంకటాపూర్​ మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ పాల్గొన్నారు.