ములుగు: పైసా లేకుండా దర్శనం చేసుకునే ఏకైక జాతర మేడారం అని మంత్రి సీతక్క అన్నారు. ఫిబ్రవరి 17వ తేదీ శనివారం మేడారంలో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ను మంత్రి ప్రారంభించారు. అనంతంర అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో జాతరకు భక్తులు కాలినడకన వచ్చేవారని, కానీ ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. భక్తుల కోసం ఈసారి 6 వేల బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఓపికతో బస్సులు నడిపాలను ఆర్టీసీ డ్రైవర్లకు, అధికారులను కోరారు. భక్తులు సంతోషంగా వచ్చి వెళ్లేలా చూడాలన్నారు. ఇవాల్టి నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.