
మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖపై మంత్రి సీతక్క స్పందించారు. తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ లేఖ రావడం బాధాకరమన్నారు సీతక్క. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తొలిసారి ఆదివాసి బిడ్డకు మంత్రి పదవి దక్కితే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తన పర్శనాలిటీని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అది మావోయిస్టుల లేఖనా? లేక తానంటే గిట్టని వాళ్లు కుట్ర పూరితంగా సృష్టించారా అనేది తేలాల్సి ఉందన్నారు. ఆ లేఖను ముందుపెట్టి కొందరు తనపై రాజకీయ కక్ష్యను తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. తనను ఓడించాలని నాడు వంద కోట్ల వరకు పెట్టారు కానీ ములుగు ప్రజలు తనను గెలిపించారని చెప్పారు సీతక్క.
►Also Read : గోదావరి నదిపై ప్రాజెక్ట్ కడితే బనకచర్ల వివాదం ఉండేది కాదు
నాకు మంత్రి పదవి వచ్చినప్పటినుంకచి ఎప్పుడు దించాలి అని చూస్తున్నారు. జీవో నంబర్ 48ను రద్దు చేయాలని తీర్మానం చేశాం. ప్రతిపక్షంలో పోరాటం చేశా. అధికారంలో సమస్యల పరిష్కారమేనా బాధ్యత. కొత్తగా అడవి కొట్టవద్దు.. పాతది కాపాడుకోండి. నేను ఒక మహిళను అని కూడా చూడకుండా బాధాకరంగా ప్రచారాలు చేస్తున్నారు. అట్టడుగు వర్గాల కోసమే నా పోరాటం.. ఆరాటం. గత ప్రభుత్వంలో చెట్లకు కట్టేసి కొట్టారు. ఆదివాసి బిడ్డను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. నిన్నటిదాకా అధికారంలో ఉన్నది మీరే కదా. ఆదివాసీలకు ఎందుకు భూమి ఇవ్వలేదు అని సీతక్క ప్రశ్నించారు.